కార్తీక సోమవారం ఆరుద్ర నక్షత్రం కావడంతో శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. మండలంలోని అన్ని శివాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ...
5:52:00 PM
కార్తీక సోమవారం ఆరుద్ర నక్షత్రం కావడంతో శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. మండలంలోని అన్ని శివాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపార్చనలు చేసారు. పలు ఆలయాల్లో అభిషేకాలు కుంకుమార్చనలు చేసారు.
మాదివాడలోని మదనగోపాలస్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపార్చన నిర్వహించారు. దీపార్చనను ఎమ్మెల్యే వీ వీ శివరామరాజు ప్రారంభించారు. ప్రముఖ పండితుడు బ్రహ్మశ్రీ కోట్ల లక్ష్మినరసింహం ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం జరిగింది. మహిళలతో అన్ని ఆలయాలు కిటకిటలడాయి.
Copyright©2026 All Rights Reserved. Manaakividuinfo.com Website.