Ads by Google


కొల్లేరుకు పూర్వ వైభవం

ఆకివీడు : కొల్లేరు పరిరక్షణ, ఉప్పుటేరు ప్రక్షాళన అంశాలు మల్లి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీటిపై ప్రత్యేక్ష ద... thumbnail 1 summary


ఆకివీడు : కొల్లేరు పరిరక్షణ, ఉప్పుటేరు ప్రక్షాళన అంశాలు మల్లి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీటిపై ప్రత్యేక్ష ద్రుష్టి సారించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉప్పుటేరుపై 6వ మైలురాయి వద్ద జువ్వ కనుమప్రాంత (ఆకివీడు వద్ద రైల్వే వంతెన ఎగువన) లో ఒక రెగ్యూలేటర్ నిర్మాణానికి డ్రైనేజీ శాఖ రూ.53.07 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు తయారు చేసింది. అలాగే ఉప్పుటేరుపై సముద్ర మొగబాగంలో చిన్నగొల్లపాలెం వద్ద స్ట్రెయిట్ కట్ ప్రాంతంలో మరో రెగ్యూలేటర్ నిర్మాణానికి కూడా డ్రైనేజీ శాఖ అంచనాలు రూపొందించింది. సిమౌతేకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ రెగ్యులేటర్ నిర్మాణానికి రూ.127 కోట్లు వ్యయమవుతుందని డ్రైనేజీ శాఖ అంచనాలు రూపొందించింది. రెండు రెగ్యులేటర్ల నిర్మాణాలకు ప్రతిపాదనల అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వనికి డ్రేనేజీ శాఖ పంపింది. ఆయా రెగ్యులేటర్ల నిర్మాణాలపై ప్రభుత్వం పరిశీలిన చేస్తుంది.

కొల్లేరు ఉప్పుటేరు ఏర్పడ్డయిలా ... 
గోదావరి, కృష్ణ నదుల శివారు ప్రాంతంలో సహజసిద్దంగా కొల్లేరు, ఉప్పుటేరు ఏర్పడ్డాయి. నదుల నీటిని వినియోగించిన తరువాత అదనపు నీరు, వృధా నీరు వివిధ కాలువల ద్వారా కొల్లేరు, ఉప్పుటేరులోకి చొచ్చుకొచ్చి సముద్రంలో కలుస్తున్నాయి. రెండు దశాబ్దల క్రితం వరకు బారి వర్షాలు, వరదలతో ఈ ప్రాంతాలు ముంపునకు గురవుతూ వచ్చాయి. కృష్ణ జిల్లా నుంచి 120, పశ్చిమగోదావరి జిల్లా నుంచి సుమారు 130 పంట, మురుగు కాలువల ద్వారా అదనపు, వృధా నీరు చొచ్చుకొస్తుండేది. ఉప్పుటేరు 22 వేల క్యూసెక్కుల నీటి సామర్ధ్యంతో ప్రవహిస్తుండేది. కొల్లేరులో 10వ కాంటూర్ వరకు నీరు నిలబడి ఉండేది. దింతో చుట్టుపక్కల గ్రామాలూ, పంట పొలాల నీట మునిగితుండేవి. ఏటా ఖరీఫ్ పంట చేతికి దక్కేది కాదు. ఉప్పుటేరు సుమారు 95 మీటర్ల వెడల్పుతో 250 అడుగుల లోతులో నీటి ప్రవాహం వేగంతో ప్రవహించేది. 22వేల  క్యూసెక్కుల నీటితో నిండుగా ఉప్పుటేరు ప్రవహిస్తుండటంతో ముంపునీరు త్వరితగతిన బయటకు చొచ్చుకువెళ్లేది. ఇలా ఉప్పుటేరు, కొల్లేరు ముంపు బారిన పడుతుండటంతో సముద్రపు నీరు పర్వహించేది కాదు. వేసవిలో కూడా సీమౌత్ కు 20 నుంచి 30 కిలోమీటర్ల మేర మాత్రమే ఉప్పునీరు చొచ్చుకొచ్చి వెనక్కి వెళ్లిపోయేది.

ఉప్పునీటి కయ్యలుగా తీరగ్రామాలు
నదుల నీటి ప్రవాహాలు తగ్గిపోవడంతో కొల్లేరు, ఉప్పుటేరులో జలాలు ఇంకిపోయాయి. ఉప్పుటేరు ప్రస్తుతం 8వేల క్యూసెక్కుల నీటితో మాత్రమే ప్రవహిస్తుంది. 10వ కాంటూర్ వరకు ఉన్న కొల్లేరు సరస్సు ప్రస్తుతం 4వ కాంటూర్ వరకు మాత్రమే నీరు ఉంది. ఈ పరిస్థితులలో సముద్రపు నీరు ఎదురుగా ప్రవహించి పంట, మురుగు కాలువల్ని ముంచేస్తుంది. దింతో సస్యశ్యామలమైన పంట భూములు చౌడుగా మారుతున్నాయి. మురుగు, పంట కాలువలు ఎదురు ప్రవహించి, గ్రామాల్లోకి సముద్రపు నీరు ఆకివీడు రైల్వే వంతెన వరకు చొచ్చుకువస్తుంది. మార్చి నాటికీ కొల్లేరులోకి ఉప్పు నీరు చొచ్చుకుపోతుంది. ఉప్పుటేరుకు ఇరువైపులా ఐదు మండలాల్లోని సుమారు 18 గ్రామాల్లో 13,360 ఎకరాల పంట భూమికి ఉప్పునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పంట, మురుగు కాలువలో కాకుండా, భూగర్భ జలాల్లోకి, పొరల్లోకి ఉప్పునీరు చొచ్చుకుపోతుంది. దింతో ఆయా ప్రాంతాల్లో 600 నుంచి 800 అడుగుల వరకు మంచినీటికోసం బోర్లు తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రెండు రెగ్యులేటర్ నిర్మాణానికి అంచనాలు
ఉప్పుటేరుపై ఆకివీడు రైల్వే వంతెన సమీపంలో జువ్వ కనుమ వద్ద ఒకటి, చిన్నగొల్లపాలెం వద్ద సిమౌత్ సమీపంలో మరొకటి రెగ్యులేటర్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడంజరిగింది. రెండు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనల అంచనాల్ని రూపొందించి, పంపించాలని ఆదేశించింది. రూ.53.07 కోట్ల అంచనాలతో  ఒక, రూ.127 కోట్ల అంచనాలతో మరొక ప్రతిపాదన పంపడంజరిగింది.
టి. అప్పారావు , డ్రైనేజీ శాఖ, ఉప్పుటేరు సబ్ డివిజన్, ఆకివీడు
Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2024 All Rights Reserved. Manaakividuinfo.com Website.