Ads by Google


ఆకివీడు మండలంలో డిసెంబర్ 26న 4,213 మందికి ఇళ్ల పట్టాలు పంపిణి

Date : 23-12-2020 ఆకివీడు : మండలంలోని ఇళ్ల స్థలాలను పంపిణీకి సిద్ధం చేస్తున్నామని తహసీల్దార్ జేవిఎస్. కుమార్ చెప్పారు. కుప్పనపూడి శివారు తల్... thumbnail 1 summary

Date : 23-12-2020


ఆకివీడు : మండలంలోని ఇళ్ల స్థలాలను పంపిణీకి సిద్ధం చేస్తున్నామని తహసీల్దార్ జేవిఎస్. కుమార్ చెప్పారు. కుప్పనపూడి శివారు తల్లకోడులోని 74ఎకరాల ప్రాంతంలో పంపిణి వేదిక ప్రాంతాన్ని మంగళవారం రెవెన్యు అధికారులు, వైసిపి నాయకులు పరిశీలించారు.  తహసీల్దార్ జేవిఎస్. కుమార్ మాట్లాడుతూ మండలంలోని 4,287 మందికి స్థలాలు మంజూరుకు సిద్ధం చేశామన్నారు. అయితే 74 మందికి పట్టాలు పంపిణి చేసే ప్రాంతానికి సంబంధించి వివాదం కోర్టులో ఉందని, మిగిలిన 4,213 మందికి పట్టాలు పంపిణి చేసినట్టు వివరించారు. ఆకివీడులోని అత్యధిక లబ్ధిదారులకు తల్లకోడులో 3,273 మందికి పట్టాలు సిద్ధం చేశామన్నారు. ఈ ప్రాంతంలో రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతుందన్నారు. అర్హులైన పేదలందరికీ పట్టాలు పంపిణి చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మండల కన్వినర్ కేశిరెడ్డి మురళి, వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ నంద్యాల సీతారామయ్య చెప్పారు. ఈ నేల 26న మండలంలో పట్టాలు పంపిణి చేయాలనీ నియోజకవర్గ ఇంచార్జి పీవీల్ నరసింహరాజు నిర్ణయించారన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు చేతుల మీదుగా పట్టాలు పంపిణి చేస్తారని ఆయన వివరించారు.

Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2024 All Rights Reserved. Manaakividuinfo.com Website.