Ads by Google


లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కేటాయింపు

Date : 18-08-2020 ఆకివీడు గ్రామీణ: కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశాలమేరకు ఆకివీడు మండలం చేరుకుమిల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇళ్ల స్థల లబ్దిదారులకు ... thumbnail 1 summary
Date : 18-08-2020

ఆకివీడు గ్రామీణ: కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశాలమేరకు ఆకివీడు మండలం చేరుకుమిల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇళ్ల స్థల లబ్దిదారులకు ఎంపిక పక్రియ రెండవసారి లాటరీ విధానాన్ని సోమవారం రెవిన్యూ అధికారులు నిర్వహించారు. చేరుకుమిల్లి లోని 141 మంది లబ్ధిదారులకు చేరుకుమిల్లి, మందపాడు గ్రామాల్లో స్థలం కేటాయించేందుకు లాటరీ తీశారు. చేరుకుమిల్లి లో 71మందికి, మందపాడు లో 70 మందికి లాటరీ పద్దతిలో స్థలాలు కేటాయించారు. అయితే ఇందులో ఒక మహిళకు గతంలో చేరుకుమిల్లి లో స్థలం కేటాయించగా ఇప్పుడు మందపాడు స్థలం రావడంతో ఆమె స్థలం తీసుకునేందుకు నిరాకరించారు. మిగిలినవారందరు లాటరీ ప్రకారం వచ్చిన స్థలం తీసుకునేందుకు అంగీకరిస్తూ సంతకం చేసారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధారు సూర్యకుమార్, డీటీ సునీల్ కుమార్,ఆర్ఐ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9and Google Chrome and Mozilla Firefox
Copyright©2023 All Rights Reserved. Manaakividuinfo.com Website.