Ads by Google


మాస్క్ ధరించకపోతే అపరాధ రుసుం విధింపు

DATE : 19-08-2021 ఆకివీడు : కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మాస్క్ ఏకైక మార్గమని ట్రైనీ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రాహుల్ కుమార్ రెడ్డి చెప్ప... thumbnail 1 summary

DATE : 19-08-2021


ఆకివీడు : కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మాస్క్ ఏకైక మార్గమని ట్రైనీ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. స్థానిక జాతీయ రహదారిపై బుధవారం మాస్క్ ధరించకుండా ప్రయాణించే వాహనదారులను నిలుపుదల చేసి హెచ్చరిస్తూ అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి మాస్క్ ధరించి బయటకు రావాలని చెప్తున్నా పట్టించుకోని వ్యక్తులకు రూ.500 నుంచి 1000 వరకు అపరాధ రుసుం విధిస్తున్నట్టు హెచ్చరించారు. యువకులు మాస్క్ ధరించకుండా తిరుగుతున్నారని అలాంటి వాహనాలపై అపరాధ రుసుం విధించాలని స్థానిక పోలీసులకు ట్రైనీ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. అధికారులకు, పోలీసులకు బయపడి మాస్క్ ధరించడం కాదని, కరోనా వైరస్ ని అంతమొందించడానికి మాస్క్ ధరించాలన్నారు. ఆటో, బస్ లో ప్రయాణించే వారు భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ లు ధరించాలని ఆదేశించారు. కలెక్టర్ తో పాటు డిటి సునీల్ కుమార్, ఆర్ఐ పెద్దిరాజు, వీఆర్ఓ భాష తదితరులు పాల్గొన్నారు.

Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2024 All Rights Reserved. Manaakividuinfo.com Website.