Ads by Google


ఆకివీడు తహశీల్ధారు గా ట్రైనీ కలెక్టర్ టి.రాహుల్ కుమార్

Date : 05-08-2021 ఆకివీడు : ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా సమయ పాలన పాటించాలని ట్రైనీ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ సూచించారు. ట్రైనింగ్ లో భాగంగా... thumbnail 1 summary

Date : 05-08-2021


ఆకివీడు : ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా సమయ పాలన పాటించాలని ట్రైనీ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ సూచించారు. ట్రైనింగ్ లో భాగంగా ఆకివీడు తహశీల్ధారు గా అయన బుధవారం విధుల్లో చేరారు. అయన 42 రోజులపాటు ఆకివీడు తహశీల్ధారు గా వ్యవహరించనున్నారు. ఆయనకు డీటీ ఎం. సునీల్ కుమార్, కార్యాలయ ఉద్యోగులు స్వాగతం పలికారు. అనంతరం రాహుల్ కుమార్ ఆకివీడు లో పర్యటించారు. ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణం కోసం గుర్తించిన స్థలాలను పరిశీలించారు. మాదివాడ ప్రాంతంలో వాహనం ద్వారా ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణి తీరును పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. రేషన్ దుకాణాల్లో దస్త్రాలను తనిఖీ చేసారు. డీలర్లకు పలు సూచనలు చేసారు. అనంతరం అజ్జమూరు పంచాయతీ పరిధిలో భూ సర్వే గురించి వివరాలను తెలుసుకున్నారు. అయన వెంట కమిషనర్ సాల్మన్ రాజు , ఆర్ఐ పెద్దిరాజు తదితరులు ఉన్నారు.

Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2024 All Rights Reserved. Manaakividuinfo.com Website.