ఆకివీడు టౌన్ : ఆకివీడులోని పలు ప్రాంతాల్లో కుళాయిల ద్వారా రంగుమారిన కలుషిత నీరు సరఫరా అవుతోందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర పంచాయతీ కార్యాలయ సమీప ప్రాంత మహిళలు బుధవారం ఏఈ విజయ కుమార్ కు ఈ సమస్యను వివరించారు. కుళాయిల ద్వారా వచ్చిన నీటిని సీసాలతో తీసుకొచ్చి చూపించారు. దాదాపు నెల నుంచి ఈ సమస్య ఉందని, పరిశీలించి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరారు.












.jpg)




